ప్రధాని మోడీపై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘానికి TMC రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే సోమవారం ఫిర్యాదు చేశారు.
రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ను ఉప యోగించి, ఎన్నికల నియ మావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
Mar 28 2024, 11:28